తెలంగాణాలో కరోనా వైరస్ కేసులు వేగంగా పెరుగుతున్న సంగతి తెలిసిందే. అక్కడ లాక్ డౌన్ కూడా పెద్దగా ఫలితాన్ని మాత్రం ఇవ్వడం లేదు అనే చెప్పాలి. ఈ నేపధ్యంలో తెలంగాణా సర్కార్ ఇప్పుడు సరిహద్దుల విషయంలో  మరో కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు కనపడుతున్నాయి.  తెలంగాణా సిఎం కేసీఆర్ ఇప్పుడు సరిహద్దులను మూసి వేసే ఆలోచనలో ఉన్నారు అని సమాచారం. 

 

త్వరలోనే దీనిపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి కేసీఆర్ నిర్ణయం వెల్లడించే అవకాశాలు ఉన్నాయి అని అంటున్నారు. కేసులు పెరుగుతున్న నేపధ్యంలో సరిహద్దులను పూర్తిగా మూసి వేస్తే మంచిది అనే ఆలోచనలో కేసీఆర్ ఉన్నారు. ఇక మహారాష్ట్రలో ఆంధ్రప్రదేశ్ లో భారీగా కేసులు పెరుగుతున్న సంగతి తెలిసిందే. అందుకే ఆయన ఈ నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: