టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పచ్చి అబద్దాల కోరు అంటూ విమర్శలు చేసారు బిజెపి ఎమ్మెల్సీ సోము వీర్రాజు. ఆయన మీడియాతో మాట్లాడుతూ టీడీపీ పై అధికార వైసీపీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసారు. అచ్చెన్నాయుడు అవినీతి వ్యవహారాన్ని కులానికి అంటగడుతున్నారు అంటూ ఆయన విమర్శలు చేసారు. 

 

అచ్చెన్నాయుడు అవినీతికి కులానికి సంబంధం ఏంటీ అని ప్రశ్నించారు. ఇక  ఇసుక రేవులపై గ్లోబల్ టెండర్లను పిలవాలి అని ఆయన సూచనలు చేసారు. చంద్రబాబు తన హయాంలో కులానికి పెద్ద పీట వేసారు అని ఆయన ఆరోపించారు. అదే పంథా ను సిఎం జగన్ కొనసాగించారు అని ఆయన మండిపడ్డారు.  మైనింగ్ వ్యవహారాలతోనే సిద్దా రాఘవరావు పార్టీ మారారు అని ఆయన ఈ సందర్భంగా ఆరోపణలు చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: