ఏడాది పాలనలో అనేక అవినీతి కుంభకోణాలకు పాల్పడ్డారు అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపణలు చేసారు. పార్టీ నేతలతో నిర్వహించిన ఆన్ లైన్ సమావేశంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేసారు. యనమల చిన రాజప్ప లపై తప్పుడు కేసులు పెట్టారని ఆయన మండిపడ్డారు. దశాబ్దాలు గా రాజకీయంగా ఆదరణ ఉన్న కుటుంబాలను ఇబ్బంది  పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసారు. 

 

వైసీపీ దురాగతాలకు అడ్డు లేకుండా పోయిందని టీడీపీ నేతలను వేదనకు గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసారు. తమ మాట వినని వారిని వేధిస్తున్నారు అంటూ చంద్రబాబు  మండిపడ్డారు.  జగన్ కి రాజకీయం వ్యాపారం ఒకటే అని ఆయన ఆరోపించారు. అచ్చెన్నాయుడు ని జేసి ప్రభాకర్ రెడ్డిని చింతమనేని ప్రభాకర్ ని కక్ష గట్టి అరెస్ట్ చేసారని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: