కర్ణాటకలో కరోనా తీవ్రత ఏ మాత్రం ఆగడం లేదు. రోజు రోజుకి అక్కడ కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ప్రతీ రోజు కూడా వందకు పైగా కరోనా కేసులు నమోదు అయ్యాయి. తాజాగా కర్ణాటక ప్రభుత్వం హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. నేడు కూడా భారీగా కేసులు బయటపడ్డాయి. 

 

ఈ రోజు కర్ణాటకలో 176  కరోనా  కేసులు & 5 మరణాలు నమోదయ్యాయని అక్కడి ప్రభుత్వం పేర్కొంది. మొత్తం గా 7000 కేసులు ఉన్నాయి. అందులో 3955  కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఇంకా 2956  యాక్టీవ్ కేసులు ఉన్నాయి. కర్ణాటక లో కరోనాతో ఇప్పటివరకు 89 మంది మరణించారని ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి: