తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ శరవేగంగా విజృంభిస్తోంది. కరోనా బాధితుల సంఖ్య, మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతుండటంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో 237 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో కరోనా కేసుల సంఖ్య 4,974కు చేరింది. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 5 వేలకు చేరువలో ఉండటం గమనార్హం. 
 
రాష్ట్రంలో ప్రస్తుతం 2,412 యాక్టివ్ కేసులు ఉండగా ... 2,377 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో ముగ్గురు కరోనా భారీన పడి మృతి చెందగా రాష్ట్రంలో మృతుల సంఖ్య 185కు చేరింది. కొత్తగా నమోదైన కేసుల్లో 195 కేసులు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే నమోదు కావడం గమనార్హం. 

మరింత సమాచారం తెలుసుకోండి: