దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో విజృంభిస్తోన్న కరోనా ప్రజల్లో భయాన్ని పెంచుతోంది. జలుబు, దగ్గు, జ్వరం లాంటి లక్షణాలు కనిపిస్తే కరోనా సోకిందేమో అనే అనుమానంతో భయపడుతున్న వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. కొందరు భయందోళనకు గురై ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. తాజాగా కరోనా సోకిందనే భయంతో ఓ ఐఆర్ఎస్ అధికారి కారులోనే యాసిడ్ తాగి ఆత్మహత్య చేసుకున్నారు. 
 
దేశ రాజధాని ఢిల్లీలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. 56 ఏళ్ల ఐఆర్ఎస్ అధికారి ద్వారక జిల్లాలో కారులో యాసిడ్ తాగి ఆత్మహత్య చేసుకున్నారు.  తనకు కరోనా సోకిందనే భయంతో, తన వల్ల కుటుంబసభ్యులు ఇబ్బందులు పడకూడదని ఆత్మహత్య చేసుకుంటున్నానని అధికారి లేఖలో పేర్కొన్నారు. వైద్యులు అధికారికి కరోనా పరీక్షలు నిర్వహించగా నెగిటివ్ నిర్ధారణ అయింది. పోలీసులు ఐఆర్ఎస్ అధికారి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: