విశాఖపట్నం ఎల్జీ పాలిమర్స్‌ గ్యాస్‌ లీకేజీ దుర్ఘటనలో 15 మంది వరకు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. గత నెలలో జరిగిన ఈ సంఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఇక ఇదిలా ఉంటే... మృతి చెందిన వారికి తెలుగుదేశం పార్టీ నుంచి నేడు సహాయం అందిస్తున్నామని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటించారు. 

 

ఇటీవల మహానాడు సందర్భంగా ఎల్జీ పాలిమర్స్ కి బాధితులకు 50 వేలు సహాయం చెయ్యాలి అని టీడీపీ తీర్మానం కూడా చేసింది. ఈ నేపధ్యంలోనే ఒక్కో కుటుంబానికి రూ.50వేల చొప్పున సోమవారం వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆదేశాలు ఇచ్చారు. వారికి నేడు సాయం అందనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: