బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం ఇప్పుడు బాలీవుడ్ లో ఏ స్థాయిలో సంచలనం సృష్టించిందో అందరికి తెలిసిందే. ఈ మరణం తో ఒక్కసారిగా బాలీవుడ్ ప్రపంచం దిగ్బ్రాంతి లోకి వెళ్లిపోయింది అనే చెప్పాలి. స్టార్ హీరోగా మంచి ఇమేజ్ ని తెచ్చుకున్నా సరే అతను మానసిక ఒత్తిడి తో ఆత్మహత్య చేసుకున్నాడు. 

 

ఇక ఇదిలా ఉంటే అతని మృతదేహానికి పోస్ట్ మార్టం పూర్తి అయింది. ముంబై లోని డాక్టర్ ఆర్‌ఎన్ కూపర్ మున్సిపల్ జనరల్ హాస్పిటల్‌లో సుశాంత్ సింగ్‌రాజ్‌పుత్ పోస్టుమార్టం నిర్వహించారు. పోస్టుమార్టం నివేదిక వివరాల కోసం ఎదురు చూస్తున్నారు. ఈ నివేదిక కోసం పోలీసులతో పాటుగా సినీ ప్రపంచం మొత్తం ఆసక్తిగా ఎదురు చూస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: