ఇప్పుడు దేశ వ్యాప్తంగా కరోనా భయం జనాల్లో ఏ విధంగా ఉందో అందరికి తెలిసిందే. కరోనా దెబ్బకు చాలా వరకు ప్రజలు భయపడుతున్నారు. ఇళ్ళ నుంచి బయటకు రావడానికి కూడా ఆలోచించే పరిస్థితి ఉంది అని చెప్పాలి. ఇక ఇది ఇలా ఉంటే తనకు కరోనా సోకింది అనే భయం తో ఒక ఆల్ ఇండియా సర్వీసులకు చెందిన అధికారి  ఒకరు ఆత్మహత్య చేసుకున్నారు. 

 

ఢిల్లీకి చెందిన 56 ఏళ్ల ఐఆర్ఎస్ అధికారి తనకు కరోనా వచ్చింది అనే భయంతో ద్వారక జిల్లాలో కారులో యాసిడ్ తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. కారులో స్పృహ లేకుండా ఉన్నారు అని అక్కడి స్థానికులు అందించిన సమాచారంతో రంగంలోకి దిగి పరిక్షలు చేయగా ఆయన అప్పటికే మరణించారు అని తన వలన తన కుటుంబ సభ్యులు ఇబ్బంది పడవద్దు అని ఆయన ఆత్మహత్య చేసుకున్నారట. అయితే ఆయనకు కరోనా రాలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: