ఇప్పుడు దేశ వ్యాప్తంగా కరోనా కేసులు వేగంగా పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలోనే కరోనా పరీక్షలను వేగంగా నిర్వహించాలి అని పలువురు డిమాండ్ చేస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే తాజాగా... రాజస్థాన్ సిఎం అశోక్ గెహ్లాట్ నుంచి కీలక ప్రకటన వచ్చింది. అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన ఆయన ఒక కీలక ప్రకటన చేసారు. ఢిల్లీ, పంజాబ్, హర్యానా, మధ్యప్రదేశ్, గుజరాత్లకు కరోనా పరీక్షల్లో సాయం చేస్తామని అన్నారు ఆయన.
పొరుగు రాష్ట్రాల వారికి రోజుకు 5,000 పరీక్షలను నిర్వహించగలమని ఆయన ఒక ప్రకటన చేసారు. రాజస్థాన్లో 12 వేలకి పైగా కరోనా కేసులు నమోదు అయిన సంగతి తెలిసిందే. ఆ దేశంలో కరోనా పరిక్షలు చాలా వేగంగా జరుగుతున్నాయి.