మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. రేపటి నుంచి రెండు రోజుల పాటు జరగబోయే అసెంబ్లీ సమావేశాలకు నల్ల చొక్కాలతో ఎమ్మెల్యేలు హాజరు కావాలని ఆదేశించారు. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహాల గురించి నేతలతో సమావేశమై సుదీర్ఘంగా చర్చించిన అనంతరం చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారు. 
 
పలువురు ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్లవద్దని చంద్రబాబుకు సూచించారు. అయితే సమావేశానికి హాజరు కాని పక్షంలో శాసనమండలిలో కొన్ని బిల్లులు ఆమోదించుకునే ప్రమాదం ఉందని కొందరు నేతలు అభిప్రాయపడ్డారు. టీడీపీ నేతలపై జరుగుతున్న దాడులు, అరెస్ట్ లకు నిరసనగా సమావేశాలు జరిగినన్ని రోజులు నల్ల చొక్కాలతో హాజరు కావాలని టీడీపీ నేతలు నిర్ణయం తీసుకున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: