గత కొంతకాలంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో టీడీపీ కీలక నేతల  అరెస్ట్ లు  సంచలనంగా మారిన విషయం తెలిసిందే. టిడిపి నేతలపై అక్రమ కేసులు బనాయించి అరెస్టులకు పాల్పడ్డారు అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు సహా పలువురు నేతలు ఆరోపిస్తున్నారు. అయితే తాజాగా దీనిపై స్పందించిన వైసీపీ కీలక నేత అంబటి రాంబాబు... టీడీపీ ఆరోపణలు తిప్పికొట్టారు. 

 


 తమ ప్రభుత్వానికి ఎవరీ పై కక్ష తీర్చుకోవలసిన అవసరం లేదని... గత ప్రభుత్వం చేసిన అవినీతిని తమ ప్రభుత్వం బయటకు లాగుతుంది అంటూ చెప్పుకొచ్చారు. టిడిపి నేతలు అందరూ అప్రజాస్వామిక పదాలు వాడుతూ విమర్శలు చేస్తున్నారని... ప్రతిపక్ష పార్టీ అని మరచి టిడిపి పార్టీ రోజురోజుకూ దిగజారిపోతోంది అంటూ విమర్శించారు. పోలీసులు సరైన ఆధారాలతోనే టిడిపి నేతలను అదుపులోకి తీసుకున్నారని... గతంలో కాంగ్రెస్ పార్టీ కి పట్టిన గతే రాబోయే రోజుల్లో టిడిపికి పార్టీకి కూడా తప్పదు అంటూ అంబటి రాంబాబు హితవుపలికారు.

మరింత సమాచారం తెలుసుకోండి: