ఏపీకి పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాలలో పదో తరగతి పరీక్షలు రద్దు చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఏపీలో కూడా పదో తరగతి పరీక్షలు రద్దు చేయాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఇప్పటికే పదో తరగతి పరీక్షలను రద్దు చేయాలని పవన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేయగా తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో  పరీక్షలు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. 
 
కరోనా విజృంభిస్తున్న తరుణంలో పదో తరగతి పరీక్షలు నిర్వహించాలని తీసుకున్న నిర్ణయం తుగ్లక్ చర్య అవుతుందని చెప్పారు. ప్రభుత్వం విద్యార్థుల ఆరోగ్యంతో చెలగాటం ఆడాలనుకోవటం అవివేకం అవుతుందని విమర్శలు చేశారు. రాష్ట్రంలో కరోనా రోజురోజుకు ఉధృతం అవుతోందని.... ఇలాంటి సమయంలో పదో తరగతి పరీక్షలు నిర్వహించడం సమంజసం కాదని... వైసీపీ నేతలు కరోనాను చాలా తేలికగా తీసుకున్నారని విమర్శలు చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: