ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ నేతల అరెస్ట్ లపై పార్టీ నేతలు ఆగ్రహంగా ఉన్న సంగతి తెలిసిందే. వరుస కేసులను నమోదు చేయడంపై ఇప్పుడు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు. ఇక అరెస్ట్ లకు నిరసనగా పార్టీ  ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరూ కూడా నల్ల చొక్కాలతో సభకు హాజరు కావాలి అని నిర్ణయం తీసుకున్నారు. 

 

ఇక పార్టీ నేతలు అందరూ కూడా నల్ల చొక్కాలతోనే సభకు రావాలి అని నిర్ణయం తీసుకున్నారు. చంద్రబాబు ఫైర్ స్టేషన్ నుంచి పాదయాత్రగా నడిచి అసెంబ్లీ కి వస్తారు. ఆయనతో పాటుగా మండలి పక్ష నేత యనమల రామకృష్ణుడు హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ఉండే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: