ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ సమావేశాల నేపధ్యంలో వెంకపాలెం లో ఎన్టీఆర్ విగ్రహానికి టీడీపీ నేతలు నివాళులు అర్పించారు. టీడీపీ ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు అందరూ కూడా చంద్రబాబు తో కలిపి నివాళులు అర్పించారు. ఇక అక్కడి నుంచి నేరుగా టీడీపీ నేతలు అసెంబ్లీ కి బయల్దేరారు. 

 

ఇక ఇదిలా ఉంటే మూడు రాజధానులు వద్దు ఒక రాజధానే ముద్దు అంటూ అసెంబ్లీ వద్ద ఆందోళనకు రైతులు సిద్దమైనట్టు తెలుస్తుంది. టీడీపీ నేతలు నివాళులు అర్పించడానికి వెళ్ళిన సందర్భంగా అక్కడ నినాదాలు కూడా చేసారు రైతులు. కాగా కాసేపట్లో ఏపీ బడ్జెట్ సమావేశాలు మొదలు కానున్నాయి. ఈ సమావేశాల్లో 8 బిల్లులను ఏపీ సర్కార్ ప్రవేశ పెట్టే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: