ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ ని మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి ప్రవేశ పెట్టారు. వైద్య, విద్య సంక్షేమం, గృహ నిర్మాణ సహా నవ రత్నాలకు పెద్ద పీట వేసారు. వ్యవసాయ రంగానికి భారీగా నిధులను కేటాయించారు. అలాగే నాడు నేడు వైద్య విద్య రంగాల్లో భారీగా కేటాయింపులు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ప్రతీ సంక్షేమ కార్యక్రమానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం నిధులను కేటాయించింది.

 

ఇక ఇదిలా ఉంటే బడ్జెట్ ప్రసంగం సమయంలో టీడీపీ బాయ్ కాట్ చేసింది. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, ఎమ్మెల్యేలు అందరూ కూడా బయటకు వెళ్ళిపోయారు. టీడీపీ ఎమ్మెల్యేలు అందరూ కూడా నల్ల చొక్కాలు ధరించి బడ్జెట్ సమావేశానికి హాజరయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి: