టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పార్టీ ఎమ్మెల్సీలతో ఫోన్ లో మాట్లాడారు. ప్రతీ ఒక్కరు కూడా సభకు హాజరు కావాలి అని ఆయన కోరారు. ఇక పార్టీ కార్యాకలాపాలకు దూరంగా ఉంటున్న కేయీ ప్రభాకర్ తో కూడా ఆయన మాట్లాడారు. తనకు చిన్న చిన్న సమస్యలు మినహా పెద్దగా ఏ సమస్యలు లేవు అని చెప్పారు. 

 

ఇక అనారోగ్యం కారణంగా తాను సమావేశాలకు రాలేకపోతున్నా అని ఎమ్మెల్సీ శత్రుచర్ల చంద్రబాబుకి సమాచారం ఇచ్చారు. ఇక శమంతకమని అదే విధంగా పోతుల సునీత శివనాథ్ రెడ్డికి టీడీపీ విప్ జారీ చేసింది. కాగా మండలి లో రెండు బిల్లులను ప్రవేశ పెట్టిన నేపధ్యంలో రూల్ 90 కింద టీడీపీ నోటీసులు ఇచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: