ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తోంది. రాష్ట్రంలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. రాష్ట్రంలో గత 24 గంటల్లో 351 కేసులు నమోదయ్యాయి. వీరిలో రాష్ట్రానికి చెందిన వారు 275 మంది అని తెలుస్తోంది. గడచిన 24 గంటల్లో నమోదైన కేసులతో కరోనా బాధితుల సంఖ్య 5555కు చేరింది. వీరిలో 2906 మంది ఇప్పటివరకు డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 2559 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 
 
గడచిన 24 గంటల్లో కర్నూలు, గుంటూరు జిల్లాల్లో ఒక్కొక్కరు మరణించారు. విదేశీయులు, వలసకూలీలు 1516 మంది కరోనా భారీన పడ్డారు. రాష్ట్రంలో కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతుండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. లాక్ డౌన్ సడలింపుల వల్లే కేసుల సంఖ్య పెరుగుతోందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: