కరోనా  వైరస్ ప్రభావంతో విద్యార్థుల చదువులు ఆందోళనలో పడిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాలు  కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నాయి. తాజాగా ఏపీలో ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదల అవ్వగా  పదోతరగతి పరీక్షలపై కూడా స్పష్టత ఇచ్చింది ఏపీ సర్కార్. తెలంగాణలో కూడా ఇప్పటికే పది పరీక్షలు ఎత్తివేస్తూ విద్యార్థులందరినీ పాస్ చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇక ఇంటర్ ఫలితాల విషయంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోందని అని ఎదురుచూస్తున్న సమయంలో తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది కేసీఆర్ సర్కార్. 

 

 ఫలితాల విడుదల తేదీని ఖరారు చేసింది. ఈనెల 18న తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదల కానున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఇంటర్ ప్రథమ ద్వితీయ సంవత్సరం ఫలితాలను ఒకే రోజు విడుదల చేయనున్నట్లు ఇంటర్ బోర్డు అధికారులు ప్రకటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: