అసెంబ్లీ సమావేశాలు నేపధ్యంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కరోనా పరీక్షలు చేస్తున్నారు. మరో వైపు తెలంగాణలో ఏకంగా అధికార టీఆరఎస్కు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలకు కరోనా పాజిటివ్ రావడంతో అందరూ షాక్ అవుతున్నారు. ప్రజా ప్రతినిధులు తప్పని సరి పరిస్థితుల్లో బయటకు రావాల్సిన పరిస్థితులు తలెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే మంత్రులు, ఎమ్మెల్యేలు ఎక్కడికక్కడ చాల జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు ముందు జాగ్రత్తగా కరోనా పరీక్షలు చేయించుకుంటున్నారు.
ఈ క్రమంలోనే ఏపీ పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖామంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని)కి కూడా కరోనా పరీక్షలు నిర్వహించారు. ఆయన రిపోర్టు నిన్న సాయంత్రం వచ్చినట్టు తెలుస్తోంది. ఈపరీక్షల్లో మంత్రి కొడాలి నాని రిపోర్టు నెగిటివ్ వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. నాసల్ స్వాబ్ పరీక్ష ద్వారా వైద్యులు వెల్లడించినట్లు మంత్రి కొడాలి నాని క్యాంపు కార్యాలయం వెల్లడించింది.