రాష్ట్రంలో ఇసుక మాఫియాను కట్టడి చేస్తున్నామన్నారు మంత్రి పెద్దిరెడ్డి. కాసేపటి క్రితం ఆయన మీడియాతో మాట్లాడారు. నూతన పాలసీ ద్వారా పారదర్శకంగా ఇసుక విక్రయాలు చేస్తున్నామని మండలిలో ఆయన వ్యాఖ్యానించారు. ఇప్పటి వరకు ఇసుక వ్యవహారంలో అక్రమాలకు పాల్పడిన ఘటనలపై 1386 కేసులు పెట్టామని పేర్కొన్నారు. 2500 మందిపై చర్యలు తీసుకున్నామన్నారు ఆయన. 

 

అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న1752 వాహనాలను సీజ్ చేశామని ఆయన వివరించారు. ఎడ్ల బండ్లకు ఉచితంగా ఇసుకను ఇస్తున్నామని పేర్కొన్నారు. సచివాలయ వ్యవస్థ ద్వారా ఇసుకను బుక్ చేసుకునే అవకాశం కల్పించామని వ్యాఖ్యానించారు. శాస్త్రీయంగా ఇసుకు పాలసీని అమలు చేస్తున్నామన్న ఆయన... గడిచిన అయిదేళ్ళలో టీడీపీ ఇసుకను దోపిడీ చేసిందని పేర్కొన్నారు. తాము ఇసుక దోపిడీని అడ్డుకోవడాన్ని టీడీపీ సహించలేక పోతోందని ఈ సందర్భంగా ఆరోపించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: