తెలంగాణాలో కరోనా బారిన ఎక్కువగా పడుతున్న వారిలో జర్నలిస్ట్ లు కూడా ఉన్నారు. హైదరాబాద్ నగరంలో కొత్తగా 12 మంది జర్నలిస్ట్ లకు కరోనా సోకింది. ఇక వారు అందరికి కూడా జర్నలిస్ట్ ల సంఘం ఆర్ధిక సహాయం చేసింది. నగరంలో కొత్తగా మరో 12 మంది జర్నలిస్టులకు వచ్చింది అని వారికి ఒక్కొక్కరికి 20వేల చొప్పున సహాయం చేస్తున్నామని...

 

హోం క్వారంటైన్‌లో ఉన్న 6 గురు జర్నలిస్టులకు 10వేల చొప్పున మొత్తం 3లక్షల ఆర్ధిక సహాయం చేస్తున్నామని తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ ఛైర్మన్‌ అల్లం నారాయణ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వారి వారి బ్యాంకు ఖాతాల్లో ఈ సొమ్ముని ఆయన జమ చేసారు. ఇప్పటి వరకు 68 మంది జర్నలిస్టులకు కరోనా పాజిటివ్ వచ్చింది. వారు అందరికి 20వేల చొప్పున 13 లక్షల 60వేల రూపాయల ఆర్దిక సాయం అందించామని చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: