కల్నల్ సంతోష్ బాబు మృతదేహానికి అక్కడి ప్రజలు పెద్ద ఎత్తున నివాళులు అర్పిస్తున్నారు. ఇక ఆర్మీ అధికారులు కూడా అక్కడికి చేరుకున్నారు. అలాగే ఉన్నతాధికారులు జిల్లా ఎస్పీ కూడా అక్కడికి చేరుకొని అంత్యక్రియల ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నట్టు తెలుస్తుంది. జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణా రెడ్డి కూడా అక్కడే ఉన్నారు. 

 

కర్నల్ సంతోష్‌బాబు పార్థివదేహాన్ని కడసారి చూసేందుకు భారీగా ప్రజలు, అభిమానులు తరలి రావడంతో పోలీసులు భారీగా భద్రత ఏర్పాటు చేసారు. సూర్యాపేటలో ఆయన నివాస౦ వద్ద పటిష్ట చర్యలు చేపట్టారు. కరోనా రాకుండా ఎవరి జాగ్రత్తలు వాళ్ళు తీసుకుంటూ నివాళులు అర్పిస్తున్నారు. కాసేపట్లో ఆయన అంత్యక్రియలు మొదలు కానున్నాయి. అంతిమ యాత్రగా తీసుకుని వెళ్లి నిర్వహిస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి: