హైదరాబాద్ లో కరోనా కేసులు ఇప్పుడు ఆస్పత్రులను బాగా భయపెడుతున్న సంగతి తెలిసిందే. ఆస్పత్రుల్లో కరోనా కేసులు రావడంపై ఇప్పుడు సర్వత్రా కూడా ఆందోళన వ్యక్తమవుతుంది. ఈ పరిణామం పై ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆందోళన వ్యక్తం చేస్తుంది. గాంధీ ఆస్పత్రిలో నిమ్స్ ఆస్పత్రిలో అలాగే ఫీవర్ ఆస్పత్రిలో కరోనా కేసులు క్రమంగా బయటపడుతున్నాయి. 

 

తాజాగా మరో ఆస్పత్రిలో కరోనా కేసులు బయటపడ్డాయి. కరోనా సరోజినీ కంటి ఆస్పత్రిలో ఇద్దరు పీజీ వైద్య విద్యార్ధులకు కరోనా సోకింది అని అధికారులు వెల్లడించారు. దీనితో ఆస్పత్రిలో ఉన్న రోగులకు కూడా కరోనా పరిక్షలు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు ఇతర విద్యార్ధులు ఆందోళనలో ఉన్నారు. ఆస్పత్రి మొత్తాన్ని శానిటేషన్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: