కృష్ణా జిల్లాలో ఇప్పుడు అక్రమ మద్యం కలకలం రేపుతుంది. ప్రతీ రోజు కూడా ఎక్కడో ఒక చోట అక్రమ మద్యం పోలీసులు స్వాధీనం చేసుకుంటూనే ఉన్నారు. తాజాగా మరో చోట పోలీసులు అక్రమ మద్యం స్వాధీనం చేసుకున్నారు. కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలులో అక్రమ మద్యం భారీగా పట్టుకున్నారు. 

 

పెనుగంచిప్రోలులోని మున్నేరు నది బ్రిడ్జి వద్ద అక్రమంగా తరలిస్తున్న 2,500 మద్యం బాటిళ్లను  మినీ లారీలో డ్రమ్ములలో పెట్టుకొని తరలిస్తున్న సమయంలో అనుమానం వచ్చి చెక్ చేయగా పోలీసులకు మద్యం దొరికింది. ఈ మద్యం విలువ సుమారు 3లక్షలు ఉండవచ్చని అధికారులు పేర్కొన్నారు. దీని వెనుక స్థానిక రాజకీయ నాయకుడి హస్తం ఉన్నట్టు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: