విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో గంజాయిని లిక్విడ్ రూపంలో సరఫరా చేస్తున్న ముఠా గుట్టు రట్టైంది. గంజాయిని సప్లై చేస్తున్న ముఠాకు పోలీసులు చెక్ పెట్టారు. విశాఖలోని హుకుంపేట మండంలం పరిధిలోని నందివలసలో ఎక్సైజ్‌ శాఖ చేపట్టిన తనిఖీల్లో 14 లీటర్ల హాషిప్‌ ఆయిల్‌ను సీజ్‌ చేశారు. పోలీసులు గంజాయి సరఫరా చేస్తున్న ఒక వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. పట్టుబడ్డ హాషిప్ ఆయిల్ విలువ రూ.12 లక్షలు ఉంటుందని అధికారులు చెబుతున్నారు. 
 
గతంలో ఈ ప్రాంతం నుంచి అనేక ప్రాంతాలకు గంజాయి సప్లై జరిగేది. కానీ పోలీసులు తనిఖీలు కఠినంగా చేస్తూ ఉండటంతో స్మగ్లర్లు కొత్త మార్గాలను అన్విషిస్తున్నారు. లిక్విడ్ గంజాయి దొరకడంతో అధికారులు మరింత అప్రమత్తమయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: