ఆంధ్రప్రదేశ్ లో ఒక్క రోజే 400 కేసులు నమోదు అయ్యాయి అని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. గత 24 గంటల్లో రాష్ట్రంలో 425 కేసులు నమోదు అయ్యాయి. రోజు రోజుకి కరోనా కేసులు ఏపీలో భారీగా పెరుగుతున్నాయి. మరణాల సంఖ్య కూడా పెరుగుతుంది. 92 మంది కరోనాతో మరణించారు. గత 24 గంటల్లో ఇద్దరు మరణించారు. 

 

మొత్తం కేసుల సంఖ్య చూస్తే 7496 కి చేరుకుంది. ఇక యాక్టివ్ కేసుల సంఖ్య కూడా పెరిగింది. రాష్ట్రంలో మొత్తం 3632  యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య కూడా భారీగా పెరుగుతుంది. మొత్తం 3772 మంది కరోనా నుంచి కోలుకున్నారు అని రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: