మనిషి జీవితం ఎంతో విలువైనదని అంటారు.. కానీ ఈ మద్య కొంత మంది క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాలు ఎంతో దారుణంగా ఉంటున్నాయి.  తమ జీవితంపై విరక్తి పుట్టి.. ఇక ముందు భవిష్యత్ అందకారం అనుకొని ఆత్మహత్యలకు పాల్పపడుతున్నారు. ఇది సామన్యులకు మాత్రమే కాదు.. సెలబ్రెటీలు సైతం నిరాశతో తనువు చాలించుకుంటున్నారు. తాజాగా మహారాష్ట్రలోని పుణెలో దారుణం చోటు చేసుకుంది. ఒకే కుటుంబంలోని నలుగురు ఆత్మహత్యకు పాల్పడటం కలకలంరేపింది. పుణెలోని సుఖ్‌సాగర్‌ ప్రాంతంలో ఓ కుటుంబం నివసిస్తోంది. ఇద్దరు పిల్లలకు ఉరి వేసి చంపిన అనంతరం దంపతులిద్దరూ ఉరివేసుకుని బలన్మరణానికి పాల్పడ్డారు.

 

శుక్రవారం ఉదయం నలుగురు మృతి చెంది ఉండటాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారమందించారు. ఈ ఉదయం వారు నలుగురు విగతజీవులుగా పడి ఉండడాన్ని చూసిన ఇరుగుపొరుగు వారు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టు మార్టానికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా వారు ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలుస్తోంది. ఈ ఘటనతో సుఖ్‌సాగర్ ప్రాంతంలో విషాదం నెలకొంది.

మరింత సమాచారం తెలుసుకోండి: