తూర్పుగోదావరి జిల్లాలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో కరోనా కేసులు భయపెడుతున్నాయి. తాజాగా మరోసారి ఆ ప్రాంతంలో 13 కేసులు బయటపడ్డాయి. తూర్పు గోదావరి జిల్లా ఆలమూరు మండలం పెనికేరులో 13 కరోనా కేసులు ఒక్క రోజే బయటకు వచ్చాయి. ఆ గ్రామంలో ఒక డ్రైవర్‌కు రెండు రోజుల క్రితం పాజిటివ్ వచ్చింది. 

 

దీనితో 40 మంది అనుమానితులకు పరీక్షలు నిర్వహించగా అందులో 13 మందికి పాజిటివ్‌ వచ్చింది. ఇక సదరు డ్రైవర్ కుటుంబ సభ్యులు అందరికీ పాజిటివ్‌ అని తేల్చారు అధికారులు. గత నెల 29న ఓ లారీ డ్రైవర్ కరోనా లక్షణాలతో ప్రాణాలు కోల్పోయారు. కరోనా పరిక్షలు లేకుండా అంత్యక్రియలు నిర్వహించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: