తెలంగాణాలో నిన్న ఇంటర్ మొదటి రెండవ ఏడాది పరీక్షా ఫలితాలను తెలంగాణా ఉన్నత విద్యా శాఖ విడుదల చేసింది. మంత్రి సబితా ఇంద్రా రెడ్డి ఈ పరిక్షా ఫలితాలను విడుదల చేసారు. ఇక ఇది ఇలా ఉంటే పరీక్షల్లో ఫెయిల్ అయ్యామనే బాధతో పలువురు విద్యార్ధులు ఆత్మహత్యలు చేసుకోవడం ఆందోళన కలిగిస్తుంది. 

 

వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలం బధ్యనాయక్ తాండాలో విషాదం చోటు చేసుకుంది. ముజాహిద్ పుర్ ప్రభుత్వ మోడల్ స్కూల్ అండ్ కళాశాలలో చదువుతున్న విద్యార్థిని విస్లావత్ నిఖిత (17) ఇంటర్మీడియట్  ఫెయిల్ అవ్వడంతో మనస్తాపం తో ఆత్మహత్య చేసుకుంది. నిన్న పరిక్షా ఫలితాలు వచ్చిన గంట కే ఇద్దరు విద్యార్ధులు ఆత్మహత్య చేసుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: