ఆంధ్రప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల్లో విజయం సాధించిన నలుగురు వైసీపీ అభ్యర్ధులు మీడియాతో మాట్లాడారు. 

 

పిల్లి సుభాష్ చంద్రబోస్ మాట్లాడుతూ... మా లాంటి వాళ్లకు పార్లమెంట్ లో అడుగు పెట్టడం అనేది ఒక కల అని అలాంటిది  మాకు సిఎం జగన్ ఈ అవకాశం ఇచ్చారని అన్నారు. 

 

మోపిదేవి వెంకటరమణ మాట్లాడుతూ... ఈ రోజు నా జీవితంలో మరిచిపోలేని రోజు అన్నారు. జగన్ నాకు రాజ్యసభలో అడుగు పెట్టే అవకాశం ఇచ్చారని అన్నారు. 

 

అయోధ్య రామిరెడ్డి మాట్లాడుతూ: ఈ రోజు చాలా సంతోషంగా ఉందని తనను గెలిపించిన వారు అందరికి ధన్యవాదాలు అని పేర్కొన్నారు. 

 

ఇక పరిమల్ నత్వాని మాట్లాడుతూ... తన గెలుపుకి సహకరించిన వారు అందరికి ధన్యవాదాలు అని ఏపీ కి తన వంతు కృషి చేస్తా అన్నారు ఆయన.

మరింత సమాచారం తెలుసుకోండి: