గత కొన్ని రోజులుగా తెలంగాణాలో అడవి జంతువులు ఇప్పుడు భయపెడుతున్న సంగతి తెలిసిందే. ఎక్కడో ఒక చోట చిరుత బయటకు వస్తూనే ఉంది. తాజాగా మరో చోట చిరుత బయటకు వచ్చింది. జగిత్యాల పట్టణం లో ఒక చిరుత సంచలనం సృష్టించింది.  జగిత్యాల పట్టణంలో పలువురు స్థానికుల మీద చిరుత దాడి చేసింది. 

 

సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు దాని కోసం గాలింపు చర్యలు కూడా చేపట్టారు. రాత్రి అంతా దాని ఆచూకి కోసం ప్రయత్నాలు చేసారు. ఇక స్థానికులు కూడా దాన్ని పట్టుకోవడానికి ప్రయత్నాలు చేసారు. రాళ్ళు కర్రలతో దాన్ని పట్టుకోవడానికి పరుగులు తీసారు. అయినా సరే అది మాత్రం ఎవరికి కనపడలేదు. ఇక అక్కడి స్థానికులు ఇప్పుడు బయటకు రావడం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: