తెలంగాణాలో కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ఎక్కువగా ఎమ్మెల్యేలను కరోనా కేసులు బాగా భయపెడుతున్నాయి. రోజు రోజుకి కరోనా కేసులు వారినే ఎక్కువగా వెంటాడుతున్నాయి. కరోనా కట్టడిలో ఉండే పోలీసులు ప్రజా ప్రతినిధులను ఈ విధంగా కరోనా వెంటాడటం నిజంగా భయపెడుతున్న అంశంగా చెప్పుకోవచ్చు. 

 

ఇక తాజాగా బిజెపి ఎమ్మెల్సీ రాజా సింగ్ గన్ మెన్ కి కరోనా పాజిటివ్ వచ్చింది. రాజసింగ్ గన్‌మెన్ బలరాం యాదవ్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని అధికారులు తెలిపారు. కరోనా లక్షణాలతో బాధ పడుతున్న అతను కరోనా పరిక్షలు చేయించుకోగా అతనికి కరోనా వచ్చినట్టు తేల్చారు. ఇక రాజా సింగ్ కూడా కరోనా పరిక్షలు చేయించుకున్నారు. ఆయన రిపోర్ట్ రావాల్సి ఉందని అధికారులు పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: