భారత్ చైనా సరిహద్దుల్లో ఉన్న ఉద్రిక్త వాతావరణం నేపధ్యంలో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేస్తున్న వ్యాఖ్యలపై ఇప్పుడు బిజెపి తీవ్ర స్థాయిలో మండిపడుతుంది. ఆయన ప్రతీ ఒక్కటి రాజకీయం చేస్తున్నారు అంటూ మండిపడ్డారు బిజెపి నేతలు. తాజాగా ఒక సైనికుడి తండ్రి... దేశాన్ని కీర్తిస్తూ ఉన్న వీడియో ని జాతీయ మీడియా పోస్ట్ చేసింది. 

 

భారత సైన్యం బలమైన సైన్యం మరియు చైనాను ఓడించగలదు. రాహుల్ గాంధీ ఇలాంటి రాజకీయాలు చేయవద్దు. నా కొడుకు సైన్యంలో పోరాడారు మరియు సైన్యంలో పోరాటం కొనసాగిస్తాడు. అంటూ గాల్వాన్ వ్యాలీ లో గాయపడిన సైనికుడి తండ్రి కామెంట్ చేసారు. దీనిని ట్వీట్ చేసిన అమిత్ షా... ధైర్య సైనికుడి తండ్రి మాట్లాడుతున్నారు. మిస్టర్ రాహుల్ గాంధి కి ఇది స్పష్టమైన సందేశం. దేశం మొత్తం ఐఖ్యంగా ఉన్న సమయంలో రాహుల్ గాంధి చిన్న చిన్న రాజకీయాలను పక్కన పెట్టి పైకి రావాలి అని ఆయన కోరారు.

మరింత సమాచారం తెలుసుకోండి: