చైనా భారత్ సరిహద్దులలో ఉద్రిక్త వాతావరణం ఏమో గాని ఇప్పుడు బిజెపి కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం మాత్రం తీవ్ర స్తాయిలో జరుగుతుంది. కేంద్రం పై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తీవ్ర స్థాయిలో విమర్శలు చేసారు. భారత భూభాగాన్ని కేంద్రం చైనాకు ఇచ్చేసిందంటూ ఆయన విమర్శలు చేసారు. ఇక ఆయన రాహుల్ కి కూడా అదే స్థాయిలో సమాధానం ఇచ్చారు. ఇది పక్కన పెడితే ఇప్పుడు సోషల్ మీడియాలో కాంగ్రెస్ కార్యకర్తలు కొన్ని పోస్ట్ లు చేస్తున్నారు. 

 

నిన్న అఖిల పక్ష సమావేశంలో ప్రధాని నరేంద్ర మోడీ సోనియా గాంధీ ప్రశ్నలకు నీళ్ళు నమిలారు అని అసలు మోడికి ఏం జరుగుతుంది సరిహద్దుల్లో అనే విషయం కనీస అవగాహన లేదు అంటూ కామెంట్ చేస్తున్నారు. దానికి బిజెపి కూడా ఘాటుగానే సమాధానం ఇస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: