గోదావరి తీరం కరోనా దెబ్బకు అల్లాడిపోయే పరిస్థితి వచ్చింది. రెండు జిల్లాల్లో కూడా కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ఇక ఇదిలా ఉంటే తాజాగా యానాం నియోజకవర్గంలో కరోనా కేసు బయటపడింది. ఇక బాలుడు కి కోరనా ఉంది అని గుర్తించారు. కనకాలపేట గ్రామంలో ఓ బాలుడికి కరోనా పాజిటీవ్ గా తేలడంతో ఒక్కసారిగా ఆందోళన మొదలయింది. హైదరాబాద్ నుంచి సదరు బాలుడు ఈ ఇటీవలే వచ్చాడు. అతని వయసు 12 ఏళ్ళు. 

 

లక్షణాలు ఉండటం తో కరోనా పరిక్షలు నిర్వహించగా కరోనా ఉందని వెల్లడి అయింది. దీనితో అతన్ని ఐసోలేషన్ కి తరలించారు. అదే విధంగా అతని కుటుంబాన్ని కూడా క్వారంటైన్ లో పెట్టారు అధికారులు. ఇక సదరు గ్రామంలో ప్రభుత్వం అప్రమత్తమైంది.

మరింత సమాచారం తెలుసుకోండి: