కర్నాటకకు చెందిన ఎం నాగరాజు అనే కాబోయే ఎమ్మెల్సీ ఇప్పటి వరకు దేశంలో అత్యంత ధనవతుడు అయిన ఎమ్మెల్సీగా నిలవనున్నారు. త్వరలో జరగబోయే కౌన్సిల్ ఎన్నికల్లో నాగరాజు పోటీ చేయనున్నారు. ఆయనను బిజెపి అధిష్టానం పోటీలో నిలబెడుతుంది. ఈ నేపధ్యంలోనే సార్వాడు తనకు 155 బ్యాంకుల్లో రూ.144.41 కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నాయని నామినేషన్ల అఫిడవిట్లో ధైర్యంగా వెల్లడించారు.
హోస్కోట్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి బిజెపి రెబల్ చేతిలో ఓటమి పాలయ్యారు. ఈయనకు మాజీ సిఎం సిద్దరామయ్య సన్నిహితుడిగా పేరు ఉంది. ఇక 42 బ్యాంకుల్లో 34 కోట్ల డిపాజిట్ లు కూడా ఆయన పేరు మీద ఉన్నాయి. పాలసీలు ఆస్తులు అన్నీ కలిపి సార్ కి బాగానే ఆస్తులు ఉన్నాయి.