ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ఎమ్మెల్యేల గన్ మెన్ లు ఇప్పుడు కరోనా బారిన వరుసగా పడుతున్నారు. తాజాగా మరో గన్ మెన్ కరోనా బారిన పడ్డాడు. పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు ఎమ్మెల్యే గన్ మెన్ కరోనా బారిన పడ్డారు. నిడదవోలు ఎమ్మెల్యే గెడ్డం శ్రీనివాస్ నాయుడు గన్‌మెన్‌కు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయినట్టు అధికారులు తెలిపారు. 

 

దీనితో వెంటనే ఎమ్మెల్యే కూడా కరోనా భయం తో పరిక్షలు చేయించుకున్నారు. ప్రస్తుతం  ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు కూడా హోం క్వారంటైన్ కి వెళ్ళిపోయారు. గన్ మెన్ ని అధికారులు ఏలూరు కరోనా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గన్ మెన్ కుటుంబ సభ్యులు అందరిని హోం క్వారంటైన్ చేసారు అధికారులు.

మరింత సమాచారం తెలుసుకోండి: