ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు కరోనా మందు కోసం ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు జనాలు. కరోనా కట్టడికి ఎన్ని విధాలుగా చర్యలు తీసుకున్నా సరే కట్టడి కాకపోవడంతో ఇప్పుడు మందు మీదనే ఆధారపడ్డారు. వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుందా అని చూస్తున్నారు. ఇక ఇప్పుడు భారత్ లో కరోనా మందు విషయంలో ముందు అడుగు పడింది. 

 

ముంబై కి చెందిన ఒక సంస్థ మందు కనుక్కోగా తాజాగా హైదరాబాద్ కి చెందిన హెటిరో డ్రగ్స్ కూడా మందు కనుక్కుంది. దీనికి డీసిజీఐ కూడా అనుమతులు ఇచ్చింది. దీనిని త్వరలోనే తాము అందుబాటులోకి తీసుకొస్తామని అంటున్నారు సంస్థ ప్రతినిధులు. దాని పేరు కోవిఫర్ గా సంస్థ నామకరణం చేసింది. రాబోయే రెండు వారాల్లో ఇది పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: