కృష్ణా జిల్లాలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్న సంగతి తెలిసిందే. రోజు రోజుకి జిల్లాలో కరోనా కేసులు పెరుగుతూ వెళ్తున్నాయి గాని తగ్గడం లేదు. ఇక ఇదిలా ఉంటే అక్కడ కరోనా ఇప్పుడు గ్రామాలకు కూడా విస్తరించడంతో సర్కార్ భయపడుతుంది. కృష్ణా జిల్లా పెనమలూరు కంకిపాడు, నూజివీడు, గన్నవరం, బందరు మండలాల్లో కరోనా గ్రామాల్లోకి వెళ్ళింది. 

 

పెనమలూరు మండలంలో గ్రామాల్లో కరోనా ఉండటంతో గ్రామాలలో లాక్ డౌన్ అమలు చేస్తున్నారు. ఉదయం 9 గంటల వరకే షాపులను ఓపెన్ చెయ్యాలి అని అధికారులు ఆదేశాలు ఇచ్చారు. దీనితో 9 గంటల తర్వాత షాపులను అందరూ కూడా స్వచ్చందంగా మూసి వేస్తున్నారు. కంకిపాడు మండలం, పెనమలూరు మండలంలో కేసులు పెరుగుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: