ఆంధ్రప్రదేశ్ లో ఉచిత ఇసుక విధానం అమలు చెయ్యాలి అని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామ కృష్ణ డిమాండ్ చేసారు. రాష్ట్రంలో ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేసి, నాణ్యమైన ఇసుక సరఫరాకు చర్యలు తీసుకోవాలని ఆయన సిఎం జగన్ ని కోరారు. ఆయన సిఎం కి లేఖ రాసారు. సిఎం గా బాధ్యతలు చేపట్టి ఏడాది గడిచినప్పటికీ రాష్ట్రంలో ఇసుక మాఫియా అక్రమాలు ఆగలేదని ఆయన ఆరోపించారు.
గతంలో ట్రాక్టర్ ఇసుక రూ.1500 ఉంటే ప్రస్తుతం రూ.6 వేలకు పెరిగిందని ఆయన ఆరోపించారు. మేలిరకం ఇసుక ఇతర రాష్ట్రాలకు అక్రమంగా తరలిపోతుందని ఆవేదన వ్యక్తం చేసారు. దీంతో రాష్ట్రంలో నాసిరకం ఇసుక సరఫరా వల్ల నిర్మాణ దారులు ఆందోళన చెందుతున్నారని లేఖలో ఆయన వివరించారు.