ఇటీవల గాల్వాన్ లోయలో చైనా సైనికుల దాడిలో మరణించిన కల్నల్ సంతోష్ బాబు కుటుంబాన్ని పలువురు సినీ రాజకీయ ప్రముఖులు పరామర్శిస్తున్నారు. తెలంగాణా సిఎం కేసీఆర్ అదే విధంగా తెలంగాణా కాంగ్రెస్ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు ఉత్తమ కుమార్ రెడ్డి రేవంత్ రెడ్డి సహా పలువురు పరామర్శించి  ధైర్యం చెప్తున్నారు. 

 

తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కల్నల్ కుటుంబానికి ఫోన్ చేసారు. కల్నల్ సంతోష్‌బాబు కుటుంబసభ్యులను ఫోన్‌లో పరామర్శించారు. సంతోష్‌బాబు తండ్రి ఉపేందర్‌కు చంద్రబాబు ఫోన్ చేసి... దేశం కోసం ప్రాణాన్నే త్యాగం చేసిన ధన్యజీవి సంతోష్‌బాబు అని ఆయన పేర్కొన్నారు. అమరవీరుడి ఆత్మత్యాగం తెలుగు వారందరికీ గర్వకారణమన్న చంద్రబాబు... సంతోష్‌బాబు మృతి మీ కుటుంబానికి తీరని లోటని పేర్కొన్నారు. తాము అంతా ఉన్నామని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: