బిజెపి నేతలపై తెలంగాణా వైద్య ఆరోగ్య శాఖా మంత్రి ఈటెల రాజేంద్ర తీవ్ర వ్యాఖ్యలు చేసారు. అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి కేవలం ఒక్కటే సీటు గెలిచింది అని  తాము ఆదమరిచి ఉండటం తోనే నాలుగు సీట్లు పార్లమెంట్ ఎన్నికల్లో విజయం సాధించింది అని ఆయన ఆరోపించారు. అదే విధంగా నాలుగు సీట్లు రావడంతో బిజెపికి కోతికి కొబ్బరి చిప్ప లా అయింది అని ఆయన మండిపడ్డారు. 

 

అసలు తాము వెయ్యి వెంటిలేటర్ లు అడిగితే కేంద్రం  వంద కూడా ఇవ్వలేదని ఆయన ఆరోపించారు. పీపీఈ కిట్లు ఎన్ని అడిగితే ఎన్ని ఇచ్చారు అని ఆయన ప్రశ్నించారు. ఎన్95 మాస్క్ లు ఎన్ని ఇచ్చారు అంటూ ఆయన కేంద్రాన్ని ప్రశ్నించారు. ఇతర దేశాల మీద ఉన్న శ్రద్ధ కరోనా మీద లేదని ఆయన ఆరోపణలు చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: