బిజెపి  జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా చేసిన ఆరోపణలపై తెలంగాణా వైద్య ఆరోగ్య శాఖా మంత్రి ఈటెల రాజేంద్ర కాస్త ఘాటుగా స్పందించారు. కరోనా విషయంలో తెలంగాణ ప్రభుత్వంపై బీజేపీ నేత జేపీ నడ్డా ఆరోపణలు అవాస్తవమని అన్నారు ఆయన. అసలు కేంద్రం కరోనా కట్టడికి ఎం చేసిందో చెప్పాలి అని డిమాండ్ చేసారు. జేపీ నడ్డా మాటలు గురువింద సామెతను గుర్తుచేస్తున్నాయని ఆయన ఆరోపించారు. 

 

బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కరోనా ఉధృతి కొనసాగుతోందన్నారు. దేశ రాజధానిలో కరోనాను ఎందుకు కట్టడి చేయలేదో బీజేపీ నేతలు చెప్పాలని ఆయన డిమాండ్ చేసారు. కంటైన్మెంట్‌ అనే పదానికి నిజమైన అర్థం చెప్పామని ఆయన పేర్కొన్నారు. పార్లమెంట్‌కు కూతవేటు దూరంలో కరోనా వస్తే మీకు తెలియలేదని ఆరోపించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: