బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా తెలంగాణా రాష్ట్ర సర్కార్ పై చేసిన విమర్శలపై తెరాస నేతలు ఘాటుగా సమాధానం చెప్తున్నారు. మంత్రులు హరీష్ రావు, ఈటెల రాజేంద్ర తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేసారు. కరోనా విషయంలో రాష్ట్రాలను విమర్శించడం రాజ నీతా అంటూ హరీష్ రావు ప్రశ్నించారు. ఇక కరోనా విషయంలో వైద్యుల మీద విమర్శలు చేయడం వారిని అవమానించిన విధంగానే ఉందని హరీష్ మండిపడ్డారు.
అదే విధంగా మరిన్ని తీవ్ర వ్యాఖ్యలు చేసారు. అసలు కరోనా కట్టడి విషయంలో తెలంగాణకు కేంద్రం చేసిన సాయం ఏంటి అని ఆయన ప్రశ్నించారు. కరోనా కట్టడిలో వైద్యులను అవమానించే విధంగా మాట్లాడటం సరికాదని ఆయన వ్యాఖ్యానించారు. సరిహద్దుల్లో సైనికులు, ఆస్పత్రుల్లో వైద్యులు ఒకటే అన్నారు.