కరోనా మొదలైన నాటి నుంచి నేటి వరకు కూడా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చేసే వ్యాఖ్యలపై  విమర్శలు వస్తూనే ఉన్నాయి. కనీస అవగాహన కూడా లేకుండా ఆయన వ్యాఖ్యలు చేస్తున్నారు అని పలువురు మండిపడుతున్నారు. ఇక తాజాగా ట్రంప్ కొన్ని వ్యాఖ్యలు చేసారు. ఇప్పటికే కరోనా పరీక్షలను ఎక్కువగా చేసామని అన్నారు. 

 

రెండు కోట్ల మందికి కరోనా పరిక్షలు చేసామని ఆయన వ్యాఖ్యలు చేయడం దుమారం రేగింది. ఎన్ని పరిక్షలు చేస్తే అన్ని కేసులు పెరిగే అవకాశం ఉందని కాబట్టి పరిక్షల సంఖ్యను తగ్గిస్తే మంచిది అని ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. అసలు అన్ని దేశాలు కరోనాతో భయపడుతుంటే ఆయన ఎందుకు ఈ విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారని పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: