కరోనా వైరస్ ని ఎదుర్కోవడానికి గానూ మనం మానసికంగా శారీరకంగా ఆరోగ్యంగా ఉండాలి అని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. తన అధికారిక భవనంలో యోగాసనాలు వేసారు ఆయన. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... మన జీవితంలో కరోనా సృష్టించిన ఒత్తిడిని ఎదుర్కోవడానికి యోగా సరైన మార్గం అన్నారు ఆయన. 

 

అధిక ఒత్తిడి తట్టుకోలేక యువకులు ప్రాణాలు కోల్పోతున్నారు అని యోగా తో అలాంటి  మరణాలను అడ్డుకోవచ్చు అని ఆయన అభిప్రాయపడ్డారు. కరోనాను ఎదుర్కోవడం లో యోగా చాలా బాగా ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. యోగా అనేది మొత్తం ఆరోగ్య పరిస్థితిని మెరుగు పరచడానికి ఉపయోగపడే ఒక సాధనం అన్నారు. మన జీవితంలో ఒత్తిడి అనేది సాధారణం గా ఉందని జీవన శైలిలో ఒత్తిడి కలగడం సాధారణ విషయం అని దానిని యోగా ద్వారా ఎదుర్కోవచ్చు అని ఆయన పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: