మన భూభాగంలో ఎవరూ చొరబడలేదని ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా కేంద్ర ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. అసలు ఎవరూ రాకపోతే దాడులు ఎందుకు జరిగాయని పలువురు నేతలు ప్రశ్నిస్తున్నారు. 

 

తాజాగా కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ అగ్ర నేత కపిల్ సిబాల్ కీలక వ్యాఖ్యలు చేసారు. ఎవరూ చొరబడలేదు అని అఖిలపక్ష సమావేశ౦లో ప్రధాని ఎందుకు చెప్పారు? అని నిలదీశారు. మన భూభాగంలో ఎవరూ చొరబడకపోతే 20 మంది సైనికులు ఎలా చనిపోయారు & 85 మంది ఎలా గాయపడ్డారు మరియు 10 మంది జవాన్లు & అధికారులు చైనీస్ ఆర్మీకి ఏ విధంగా బందీలు అయ్యారు అంటూ ఆయన ప్రశ్నించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: