తెలంగాణాలో 33 జిల్లాల్లో కూడా కరోనా కేసులు బయటపడుతున్నాయి. రోజు రోజుకి అక్కడ కరోనా కేసులు పెరుగుతున్నాయి గాని తగ్గడం లేదు. కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతున్నా సరే ఫలితం మాత్రం కనపడటం లేదు. ఇక ఇదిలా ఉంటే తాజాగా మంచిర్యాల లో తొలి కరోనా కేసు బయటపడింది. 

 

జిల్లా కేంద్రంలో తొలి కరోనా పాజిటివ్ కేసు నమోదైందని అధికారులు పేర్కొన్నారు. పట్టణం లోని ఒక చికెన్ సెంటర్ యజమాని తండ్రికి కరోనా వచ్చినట్టు వెల్లడి అయింది. కొద్ది రోజుల క్రితం తీవ్ర అనారోగ్యంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స తీసుకోగా అప్పుడే అతనికి కరోనా వచ్చింది అని అధికారులు గుర్తించారు. ఇప్పుడు అతని కాంటాక్ట్స్ ని బయటకు తీసే పని లో పడ్డారు అధికారులు.

మరింత సమాచారం తెలుసుకోండి: