సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏది చేసినా సరే సంచలనమే. ఆయన ఏ సినిమా చేసినా సరే దాని వెనుక ఏదోక వివాదం ఉంటుంది లేదా సంచలనం ఉంటుంది. దూకుడుగా సినిమాలు చేసే వర్మ తాజాగా అమృత, మారుతీ రావుల వ్యవహారంపై ఒక సినిమాను ప్లాన్ చేసారు. దీనికి సంబంధించి ఫాదర్స్ డే సందర్భంగా ఆయన ఒక లుక్ ని కూడా విడుదల చేసారు. 

 

అదే విధంగా సినిమా టైటిల్ ని కూడా అయన మర్డర్ అంటూ ప్రకటించారు. ఇక ఇదిలా ఉంటే తాజాగా ఆయన ఒక పోస్ట్ చేసారు సోషల్ మీడియాలో. అమృత లేదా ఎవరికి అయినా సరే తన సందేశం అని... విపరీతమైన గాయం భరించిన వ్యక్తుల పట్ల నాకు అత్యధిక గౌరవం ఉందన్నారు. మర్డర్‌లో నా చిత్తశుద్ధి... ఆ బాధను గౌరవించడం మరియు వారి అనుభవాన్ని చూపించి బాధ నుంచి తగ్గించడం అంటూ పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: